కరీంనగర్, ఏప్రిల్ 29 (జాగో న్యూస్):: కరీంనగర్ మండలం తీగల గుంటపల్లి లోని రైల్వే స్టేషన్ వద్ద గల రైల్వే హమాలీ కార్యాలయంలో హమాలీ కార్మికుల ఆధ్వర్యంలో మేడే138 వ పోస్టర్లు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ మాట్లాడుతూ….. నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో 10 సంవత్సరాల పాలనలో పరిశ్రమల మూతపడి కార్మికుల బజారున పడేసిందని కాంటాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు కరువై కోర్టు తీర్పులను పక్కనపెట్టి ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లు గా కుదించి కార్మికులను కట్టు బానిసలుగా చేసే కుట్రకు వడిగట్టిందన్నారు. 24 గంటల పాటు రైల్వేస్టేషన్లో ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తున్న రైల్వే హమాలి కార్మికులను కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. రైల్వే హమాలీ కార్మికులందరికీ కేంద్ర ప్రభుత్వం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని వారు కోరారు. రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి రైతులను మోసం చేశాడన్నారు. కులం పేరుతో మతం పేరుతో రాముడు దేవుడి మందిరాల పేరుతో ప్రజల్ని మరొకసారి మోసం చేయడానికి అనేక మాయ మాటలు చెబుతూ మన ముందుకు వస్తున్నారు ఇలాంటి మోసపూరితమైన బిజెపి నరేంద్ర మోడీ మాటలు ప్రజలు కార్మికులు రైతులు నమ్మవద్దని అన్నారు. దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజల మధ్య ఐక్యతను శ్రమజీవుల మధ్య ఐక్యత పై దాడి చేస్తుందన్నారు కార్మిక వర్గం ఇటువంటి విభజన విధానాలను తిప్పికొట్టాలని బిజెపి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని బిజెపి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక చట్టాల రద్దు ప్రభుత్వ రంగ సంస్థల ను ప్రవేటీకరణ వంటి కార్మిక వ్యతిరేక విధానాలపై మరియు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్, స్కీం రంగాల కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని కార్మిక వర్గం ఐక్యతను విస్తృతం చేసి బలమైన కార్మిక పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. కార్మిక వర్గాన్ని అనగదొక్కి కార్మికులకు వ్యతిరేకంగా పనిచేసిన బిజెపిని ఓటు అనే ఆయుధంతో తరిమి కొట్టాలన్నారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రైల్వే గూడ్స్ ట్రాన్స్పోర్ట్ హమాలి అధ్యక్షులు కాసెట్టి లక్ష్మయ్య, కార్యదర్శి గాండ్ల రమేష్ ఉపాధ్యక్షులు దాసరి ప్రభాకర్ డైరెక్టర్స్ గండు మహేందర్ ఐతమురఘుపతి,జెట్టి రాజు బొడ్డు శంకరయ్య,గాండ్ల రవీందర్, తంగేళ్ల పెళ్లి రాజు, కాసెట్టి శ్రీనివాస్, తంగెళ్లపల్లి స్వామి తదితరులు పాల్గొన్నారు.
