ఎన్నికల బరిలో 28 మంది.. * స్వతంత్ర అభ్యర్థులే అధికం.. * ఐదుగురు అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ

కరీంనగర్, ఏప్రిల్ 29 (జాగో న్యూస్): పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను ముగిసింది. నలుగురు స్వతంత్ర అభ్యర్థులు గుజ్జుల శ్రీనివాస్ రెడ్డి, ఎండీ జీషన్, పచ్చిమట్ల రవీందర్, పిడిశెట్టి రాజు, రాజ్యాధికార పార్టీ అభ్యర్థి ఆరెల్లి సుమలత తమ నామినేషన్ పత్రాలను  ఉపసంహరించుకున్నారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ సాగిందని తెలిపారు. మొత్తం 53 మంది అభ్యర్థులు 94 నామినేషన్లను దాఖలు చేశారని చెప్పారు. ఇందులో శుక్రవారం జరిపిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియలో 20 మంది అభ్యర్థుల వివరాలు, పత్రాలు సరిగా లేకపోవడంతో నామినేషన్లను తిరస్కరించామని పేర్కొన్నారు. 33 మంది అభ్యర్థుల్లో సోమవారం ఐదుగురు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఉపసంహరించు కున్నారని తెలిపారు. దీంతో కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు మొత్తం 28 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారని జిల్లా కలెక్టర్ తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు