కరీంనగర్, ఏప్రిల్ 29 (జాగో న్యూస్): పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకి మద్దతుగా జమ్మికుంట ప్రభుత్వ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న జన జాతర సభకు ప్రజలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీగా తరలి రావాలనీ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. జమ్మికుంట కాలేజీ మైదానం సభ ఏర్పాట్లను హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వోడితల ప్రణవ్ కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ మోడీ చేస్తున్న అవినీతికి వ్యతిరేకంగా ఎన్నికలో ప్రజలు తీర్పు ఇవ్వాలి. పది సంవత్సరాల నుండి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆస్తులు గుంజుకుంటుంది అని తప్పుదు ప్రచారం చేస్తున్నారు పదేలుగా బీజేపీ ప్రభుత్వమీ కదా దేశ సంపదను దోచుకుంటు అదనికి అప్పాజెప్పారు. మోడీ పది సంవత్సరాలనుండి దేశంలో అవినీతితో నింపి మళ్ళీ ఓటు వెయ్యమని అడుగుతున్నారు. ఇక్కడ గెలిచినా వ్యక్తి కూడా ఐదు సంవత్సరాలనుండి ఇక్కడ ప్రజలకు చేసింది ఏమి లేదు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతున్నాము. నిన్న కరీంనగర్ వచ్చిన కేటీఆర్ ఓటమి భయంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీ అహంకారం తోనే ప్రజలు మిమ్మల్ని గద్దెను దింపారు ఐనా ఇంకా బుద్ది రాలేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేందర్ రావు నీకంటే ముందు నుండే రాజకీయాల్లో ఉన్నారు ఆది తెలుసుకో కేటీఆర్ అని అన్నారు. 2004 లో చొప్పదండి నియోజకవర్గం నుండి పోటీ చేయమని చెప్పి రాజేందర్ రావు గారికి బీ ఫారం ఇవ్వకుండా మోసం చేసింది మీ నాన్న కెసిఆర్ బీఆర్ఎస్ నాయకులు ఓటమి భయంతో తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కరే అని చాలా నియోజకవర్గాల్లో బలహీన వ్యక్తులకు బీఆర్ఎస్ టికెట్లు ఇచ్చి బీజేపీ గెలుపు కోసం పని చేస్తుంది. దేవుడి పేరుతో రాజకీయం చేస్తున్న బీజేపీ పార్టీకి ప్రజలు బుద్ది చెప్పాలన్నారు.
