కరీంనగర్, ఏప్రిల్ 30 (జాగో న్యూస్): కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని దళిత సామాజిక వర్గాన్ని చెందిన ముఖ్య నాయకుల సమావేశం బోయినపల్లి వినోద్ కుమార్ కరీంనగర్ పార్లమెంటు కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం దళితులు అందరూ కలిసి గ్రామ గ్రామాన తిరుగుతూ కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ దళిత వాడల్లో అవగాహన కల్పిస్తూ బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసే విధంగా ప్రజల చైతన్యవంతం చేయాలని నిర్ణయించినాము. బిజెపికి ఓటు వేస్తే ఎస్సీ రిజర్వేషన్లు రద్దు చేస్తారని కాబట్టి బిజెపికి ఓటు వేయవద్దని దళితులకు వివరించాలి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేసిర్రు దళితులు ఈసారి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దని నిర్ణయించినారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గడ్డం నాగరాజు గారు కత్తెర పాక కొండయ్య నాగి శేఖర్ కలిగేటి లక్ష్మణ్ లతా శ్రీ మేడి మహేష్ వి సంపత్ కవంపల్లి రాములు అందే సుభాష్ వడ్లూరి భూమయ్య శ్రీ పల్లి గంగయ్యపు అనిల్ జె శ్రీధర్ కొమురయ్య సిహెచ్ మహేష్ జుట్టు పెళ్లి అనిల్ కుమార్ భామండ్ల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
