కరీంనగర్, జూన్ 3 (జాగో న్యూస్): స్వాతంత్రోద్యమం తర్వాత జరిగిన గొప్ప ఉద్యమం తెలంగాణ ఉద్యమమే అని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమంలో పాల్గొని గొప్ప అవకాశం మనందరికి లభించింది. స్వాతంత్రోద్యమం తర్వాత జరిగిన గొప్ప ఉద్యమం తెలంగాణ ఉద్యమం అన్నారు. కేసీఆర్ చచ్చుడో..తెలంగాణ వచ్చుడో అని నినదించింది మన కరీంనగర్ నుండే మొదలైందని, తెలంగాణ ను తెచ్చిన కేసీఆర్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. తెలంగాణను తీసుకువచ్చింది మనమే రాష్ట్రాన్ని హక్కుదారులు మనమే భవిష్యత్ తరాలను కాపాడేది కూడా మనమే అన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ అనేక సంస్కరణలు తీసుకువచ్చారని ఆనాడు రికార్డు స్థాయిలో 95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా నేడు కాంగ్రెస్ ప్రభుత్వం 45 లక్షల మెట్రిక్ టన్నుల కే పరిమితం అయింది. తెలంగాణలో నేడు అన్నదాతలు అల్లాడుతున్నారు..రైతులు విత్తనాలు ఎరువులు లేక ఆందోళన చెందుతున్నారు. మంత్రులు ఎవరు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళది వాళ్ళకే తెలియట్లేదు..వ్యవస్థ అదుపు తప్పిందని, మంత్రులను నియంత్రిస్తే ఎప్పుడు ఎక్కడ అసమ్మతి తెస్తారో అని ముఖ్యమంత్రి భయబ్రాంతులకు గురవుతున్నాడు.తెలంగాణ ప్రజల కోసం మరో ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని, ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పోయింది ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉందనారు. ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగమైంది నీళ్లు లేవు కరెంట్ లేదు, భూమి ఉన్నత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది కొందరు నాయకులు తమ స్వార్థం కోసం వస్తుంటారు పోతుంటారు కానీ పార్టీ శాశ్వతంగా ఉండిపోతుంది ఎవరూ ఖతం చేయలేరని అన్నారు. ప్రజలను రైతులను కాపాడుకునే బాధ్యత మాది ప్రజలు నష్టపోతున్నారంటే వారికి అండగా ఉంటాం పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్ధకం కానివ్వమనారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్లీ 1956 నాటి పరిస్థితులు తీసుకొస్తున్నారు. త్వరలోనే పార్టీ కార్యాలయం పునరుద్ధరించి అన్ని కమిటీలు వేయడం జరుగుతుంది. పార్టీ మారిన వారిని ప్రజలు తిరస్కరిస్తారు వాళ్ల స్థానంలో కొత్తవారిని తయారు చేస్తాం. త్వరలోనే బిఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు రానున్నాయి. ప్రతి ఒక్కరు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండండి మీకు అండగా మేముంటాం అని సమిష్టిగా ఉందాం సమిష్టిగా కృషి చేద్దాం అని గంగుల కమలాకర్ అన్నారు.
