కరీంనగర్/రామడుగు, జూన్ 3 (జాగోన్యూస్): కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన నందాల సాయి కిరణ్ ఇటీవలే విడుదల అయిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా 27వ ర్యాంకు సాధించారు. కాగా సాయికిరణ్ సోమవారం చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం తో కలసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాదులోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భగా సీఎం రేవంత్ రెడ్డి సాయికిరణ్ ను అభినందించి శాలువాతో సత్కరించారు. భవిష్యత్తులో మంచి స్థానం చేరుకొని ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని కోరారు. యువత సాయి కిరణ్ ను స్పూర్తి గా తీసుకొని జీవితం లో గొప్ప విజయాలు సాధించాలని సిఎం ఆకాంక్షించారు.
