కరీంనగర్, జూలై 20 (జాగో న్యూస్): కరీంనగర్ లోని కోతి రాంపూర్ అన్నమనేని గార్డెన్ లో శనివారం స్త్రీ, మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అమ్మ మాట- అంగన్ వాడీ బాట కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులకు సామూహికంగా అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ స్వయంగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ అంగన్వాడీ కేంద్రాల బోధన పరికరాలను పరిశీలించారు. ఆట వస్తువులు, పుస్తకాలను పర్యవేక్షించారు. చిన్నారులకు గర్భిణీలకు అందించే పోషకాహారం ప్రదర్శనను తిలకించారు. కలెక్టర్ తో పాటు అసిస్టెంట్ కలెక్టర్ అజయ్ యాదవ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
