కరీంనగర్, జూలై 20 (జాగో న్యూస్): స్వతంత్ర భారతదేశ చరిత్రలో నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ పదవి బాధ్యతలు చేపట్టారని, దేశ ప్రజలంతా బిజెపి ప్రధాని మోడీ పాలనపై విశ్వాసంతో ఉన్నారని , ప్రజల మద్దతు ఆశీర్వాదంతోనే దేశంలో బిజెపి శకం నడుస్తుందని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు.భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ విస్తృత కార్యవర్గ సమావేశం శనివారం హుజురాబాద్ పట్టణం లోజరిగింది. ఇట్టి సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన మాట్లాడుతూ 7 నెలల కాలంలోనే రాష్ట్రం లోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావిశ్వాసాన్నికోల్పోయిందన్నారు. అధికారం లో కి రావడానికి కాంగ్రెస్ లెక్కలేని హామీ లు ఇచ్చిందని, ప్రధానంగా వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రజానీకాన్ని నమ్మించి మోసం చేసిందన్నారు. ఆరు గ్యారంటీలో ఏ ఒక్క స్కీమ్ ను సక్రమంగా అమలు చేయలేదని , అన్ని పథకాలకు కండిషన్లు పెడుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ప్రజల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతుందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీపై పోరాటం చేయడానికి బిజెపి శ్రేణులంత సిద్ధం కావాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బిఆర్ఎస్ పని అయిపోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ శక్తిగా బిజెపి మాత్రమే ఉందన్నారు. రాబోయే రోజుల్లో బిజెపిని మరింత బలోపితం చేయడానికి పార్టీ నాయకులు కార్యకర్తలంతా సమిష్టి కృషి చేయాలన్నారు.కార్యవర్గ సమావేశానికి ముందు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిలపు రమేష్, బంగారి రాజేంద్రప్రసాద్ , మాజీ ఎంపీపీ వాసాల రమేష్ లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి , కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ల కు అభినందనలు తెలియజేస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అలాగే బిజెపిని ఎన్నికల్లో ఆదరించి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ను రెండవసారి భారీ మెజారిటీతో గెలిపించినందుకు ధన్యవాదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సాయిని మల్లేశం రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టారు.
రాజకీయ తీర్మానంలోని ముఖ్యంశాలు..
1) కెసిఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వ దశాబ్ద పాలనతో అన్ని వర్గాల ప్రజలు విసుగు చెందారు. కుటుంబ పాలన, అహంకార, మోసపూరిత పాలనకు చైతన్యవంతమైన ప్రజలు చమర గీతం పాడారు. ప్రధానంగా బిఆర్ఎస్ పై ఏర్పడ్డ ప్రజా వ్యతిరేకత, వందరోజులలో ఆరు గ్యారెంటీల స్కీంలను అమలు చేస్తామనే అంశాలు శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కలిసి రావడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేటికీ ఏడు నెలల కాలం గడిచిన ఆరు గ్యారెంటీల్లో ఏ ఒక్క గ్యారంటీని , సక్రమంగా అమలు చేయలేదు. ఎన్నికల సమయంలో ఏలాంటి కండిషన్ల గురించి చెప్పకుండా, నేడు అన్ని పథకాలకు కండిషన్స్ పెడుతూ ప్రజలను తీవ్రంగా మోసం చేస్తుంది. పథకాలన్నిటికీ రేషన్ కార్డు ప్రామాణికం చేసింది. పథకాలు సక్రమంగా అమలు చేసే ఉద్దేశం గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి లేనట్లుగానే నేడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఉందనే విషయం ప్రజలందరికీ అర్థమవుతుంది. అందుకే రేషన్ కార్డులు ఇవ్వకుండా, ప్రతి స్కీంకు రేషన్ కార్డు ప్రామాణికమని అర్హులకు తీవ్ర అన్యాయం చేస్తుంది. ఇలాంటి చర్యలను బిజెపి జిల్లా పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏలాంటి కండిషన్లు లేకుండా అర్హులందరికీ న్యాయం చేయాలని, రేషన్ కార్డులు తక్షణం ఇవ్వాలని బిజెపి జిల్లా శాఖ డిమాండ్ చేసింది.
2) మహాలక్ష్మి పథకంలో భాగంగా కేవలం ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించి, మహిళలకు ప్రతినెల ఇస్తామన్న రూ.2500 లను కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే రూపాయలు 500 కే గ్యాస్ సిలిండర్ విషయంలో అనేక తిరకాసులు పెడుతుంది. మహాలక్ష్మి పథకాన్ని సంపూర్ణంగా అమలు చేసి మహిళలకు ఇచ్చిన హామీలన్నీ తక్షణం నెరవేర్చాలని బిజెపి జిల్లా పక్షాన డిమాండ్ చేస్తూ తీర్మానించారు.
3)ఎన్నికలకు ముందు అన్ కండిషనల్ గా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ చెప్పింది. నేడు అనేక రకాల నిబంధనలు పెట్టి అందరిని ఎగరగొట్టే ప్రయత్నం చేస్తుంది. మార్గదర్శకాలు, నియమ నిబంధనలు పెట్టి రైతులకు అన్యాయం చేస్తుంది. 34 వేల కోట్ల రుణమాఫీ చేయాల్సిఉండగా ఏదో ఐదు ఆరు వేలకోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని పండుగలాగా, ఏదో చారిత్రాత్మక దినం లాగా వర్ణించే పిచ్చి ప్రయత్నం చేస్తుంది.ప్రభుత్వం భేషజాలకు పోకుండా అన్ కండీషనల్ గా రైతాంగానికి చెప్పిన విధంగా రుణమాఫీ చేసి, రైతులను రుణవిముక్తులను చేయాలని డిమాండ్ చేస్తున్నాము. అలాగే ప్రస్తుత సీజన్ లో రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15000, వ్యవసాయ కూలీలకు రూ .12000 రైతు భరోసా సహాయాన్ని తక్షణం అందించాలని , ధరణి సమస్యలను పరిష్కరించాలని , పంటలకు ప్రకటించిన రూ.500 బోనస్ ఇవ్వాలని , వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పిన హామీలు , వాగ్దానాలను నిలబెట్టుకోవాలని బిజెపి జిల్లా శాఖ డిమాండ్ చేసింది.
4) గృహ జ్యోతి పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే స్కీం విషయంలో గందరగోళ పరిస్థితులు తలెత్తుతున్నాయి. 200 యూనిట్ల వరకు ఉచితమని చెప్పి , మళ్లీ బిల్లులు జారీ చేస్తున్నారు. దీన్ని బిజెపి పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. 200ఉచిత విద్యుత్తును స్కీమ్ ను సక్రమంగా అమలు చేయాలని కోరుతూ తీర్మానించారు.
5) ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, రూపాయలు ఐదు లక్షలు అందిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం నేడు దాని గురించి మాట్లాడడం లేదు. నిరుపేదలకు ఇంటి స్థలాలు , ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల సహాయం అందించడానికి వెంటనే చర్యలు చేపట్టాలని బిజెపి జిల్లా శాఖ డిమాండ్ చేసింది.
6) చేయూత స్కీం ద్వారా ఇస్తామన్న రూ .4000 నెలవారి పింఛను నేటికీ ఎక్కడ అందించడం లేదు. పెన్షన్ మీద ఆధారపడి జీవించే నిస్సహాయుల ఆశల మీద కాంగ్రెస్ నీళ్లు చల్లింది . అర్హులైన ప్రతి ఒక్కరికి రూ.4000 పెన్షన్ ను అందించాలని, వృద్ధులు వికలాంగులకు , ఒంటరి మహిళలకు తక్షణం పెన్షన్లు అందించాలని బిజెపి కరీంనగర్ జిల్లా శాఖ పక్షాన డిమాండ్ చేసింది.
7) కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో ప్రకటించిన యువ వికాసం పథకం నీరుగారుతుంది. విద్యార్థులకు రూపాయలు ఐదు లక్షల విద్య భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ల పై నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఊసేత్తడం లేదు. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తుంది. కాంగ్రెస్ ప్రకటించిన విధంగా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలి, మెగా డీఎస్సీ ని కండక్ట్ చేయాలి. ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేయాలనీ, నిరుద్యోగ భృతి అందించాలని , ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని బిజెపి జిల్లా శాఖ డిమాండ్ చేసింది.
8) బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగిన వివిధ కుంభకోణాలు అవినీతి ఆరోపణలపై పూర్తిస్థాయి హైకోర్టు న్యాయమూర్తి చే విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న కాంగ్రెస్ ప్రభుత్వం నేడు సాగదీత ధోరణినీ అవలంబిస్తుంది . కాలేశ్వరం, ఫోన్ టాపింగ్, డ్రగ్స్, విద్యుత్ ఒప్పందల అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం చట్టపరంగా వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉంది. ప్రభుత్వ తీరును బిజెపి పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. పై అంశాల్లో దోషులను శిక్షించడానికి అవసరమైన అన్నిచర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది.
9) జిల్లాలోని అనేక గ్రామపంచాయతీలు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. గ్రామ పంచాయతీల పాలన అస్తవ్యస్తంగా మారింది. గ్రామాల్లో కనీస పారిశుద్ధ్య పనులు కొనసాగడం లేదు. గత సర్పంచులకు బిల్లులు రాక నేటికి ఇబ్బంది పడుతున్నారు . గ్రామాల్లో నెలకొన్న సమస్యలన్నిటిని వెంటనే పరిష్కరించాలని, సర్పంచుల బిల్లులను చెల్లించడానికి తక్షణం చర్యలు చేపట్టాలని బిజెపి జిల్లా శాఖ డిమాండ్ చేసింది.
10) జిల్లావ్యాప్తంగా వీధి కుక్కలు, కోతుల బెడద తీవ్రంగా మారింది. వీటివల్ల ప్రజలు నిత్యం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వీధి కుక్కల దాడిలో అనేకమంది గాయపడుతున్నారు. జనవాసాల మధ్య ఉంటున్న వీధి కుక్కలను, కోతులను తరలించడానికి తక్షణంచర్యలు చేపట్టాలని బిజెపి జిల్లా శాఖ డిమాండ్ చేసింది.
11) జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. వ్యాధులకు అవసరమైన అవసరమైన మందులు లేక ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులు అల్లాడుతున్నారు. పేషంట్లకు అవసరమైన మందులను అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ విషయంలో మేల్కొని రోగులకు అవసరమైన మందులను తక్షణం సరఫరా చేయాలని బిజెపి డిమాండ్ చేసింది.
12) కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో రోజురోజుకీ జటిలంగా మారుతున్న డంపు యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చేపట్టాలి. స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులు కొనసాగించడానికి మరింత సమయం , అవకాశం వచ్చినందున పూర్తిస్థాయిలో పనులన్నింటినీ పూర్తిచేయాలని బిజెపి జిల్లా కార్యవర్గ సమావేశం కోరుతూ తీర్మానించారు. ఇట్టి సమావేశంలో బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిలపు రమేష్, రాజేంద్రప్రసాద్, నాగేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి , వాసాల రమేష్, జిల్లా బాధ్యులు మాడ వెంకటరెడ్డి, బత్తుల లక్ష్మీనారాయణ, సాయిని మల్లేశం, సంపత్ రావు , గుర్రాల వెంకటరెడ్డి , కళ్లెం వాసుదేవ రెడ్డి, రాపర్తి ప్రసాద్, నరసింహ రాజు , బింగి కరుణాకర్ , బొంతల కళ్యాణ్ చంద్ర, కటకం లోకేష్, సమ్మిరెడ్డీ, సత్యనారాయణ, జానపట్ల స్వామి, మహిళ మోర్చా ప్రధాన కార్యదర్శి నిర్మల , మైనార్టీ మూర్ఛ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి ముజీబ్ , కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి సింగిరెడ్డి కృష్ణారెడ్డి , బీజేవైఎం , కిసాన్, మైనార్టీ మోర్చాల అధ్యక్షులు దుర్శటి సంపత్, అన్నాడి రాజిరెడ్డి , సమీ పర్వేజ్ , కార్పొరేటర్లు కొలగనీ శ్రీనివాస్, పెద్దపల్లి జితేందర్, కాసర్ల ఆనంద్, వంగల పవన్, నాగసముద్రం ప్రవీణ్, బండ రమణ రెడ్డి , ఉప్పరపల్లి శ్రీనివాన్, పుప్పాల రఘు, సింగిరాల రామరాజు, శ్రీనివాస్, ప్రవీణ్, మహేష్, రాము, వినో, రాజు, కుమార్, అసెంబ్లీ కన్వీనర్లు గౌతమ్ రెడ్డి, శ్రవణ్, లక్ష్మారెడ్డి , హుజురా బాద్ పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు, రూరల్ అధ్యక్షులు రాముల కొమురయ్య తో పాటు బిజెపి నాయకులు , కార్యకర్తలు వివిధ మండలాల అధ్యక్షులు , మోర్చల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.