హరిత బయో ప్రొడక్ట్స్ కంపెనీ అధ్యక్ష కార్యదర్శులు గా ఎడ్ల రమేష్,మడిపేల్లి మహేందర్

కరీంనగర్/తిమ్మాపూర్, జూలై 20 (జాగో న్యూస్): తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామంలోనీ హరిత బయో ప్రొడక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ 17 మందితో నూతన కమిటీ ఎన్నుకోవటం జరిగింది.దీనికి అధ్యక్ష, కార్యదర్శులు గా ఎడ్ల రమేష్, మడిపెళ్లి మహేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని సీఐటీయూ రాష్ర్ట కార్యదర్శి బీరం మల్లేష్ తెలియ చేశారు.నూతన కమిటీ ఏర్పాటు రాబోయే కాలంలో అనేక కార్మికుల విషయాలలో క్రమశిక్షణతో పట్టుదలతో కార్మికుల వైపు పోరాడి పలు విజయాల సాధించాలని ఆకాంక్షించారు. నూతన కమిటీ అధ్యక్షులుగా ఎడ్ల రమేష్,ప్రధాన కార్యదర్శి మడిపెల్లి మహేందర్,కోశాధికారి పొలు సంపత్,ఉపాధ్యక్షులుగా గుమ్మడి మహేందర్,రాగుల తిరుపతి, దుడ్డేలా సమ్మయ్య, ర్యాకం అశోక్, సహాయ కార్యదర్శిలుగా గంప మధు,నల్ల పవన్, కాసర్ల రాజు, ఆనంతుల వెంకట రమణ చారి, కీసర శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు గా పెద్ది హరీష్, కొండాపూర్ రాజు,గురు భూషణ్, భుజంఖర్ ఎల్లోజీ,గిరవేని శ్రీనివాస్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు