ఈ అసెంబ్లీ సమావేశాల్లో రవాణా రంగా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి * భారతీయ న్యాయ సహిత 106 (1) చట్టం రద్దు చేయాలి  * ఆటో డ్రైవర్ల పై ట్రాఫిక్ పోలీసుల దాడులు ఆపాలి * ఏఐఆర్టి డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ 

కరీంనగర్, జూలై 23 (జాగో న్యూస్): కోతి రాంపూర్ ముకుందలాల్ మిశ్రా భవన్ సిఐటియు ఆఫీసులో రవాణా రంగ కార్మికుల సమస్యలపై జిల్లా సదస్సు కరీంనగర్ పబ్లిక్ ప్రైవేటు రోడ్డు ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ జిల్లా ప్రధాన కార్యదర్శి చెలికాని శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది ,దీనికి ఏ,ఐ,ఆర్టి డబ్ల్యూ ఎఫ్ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ హాజరై మాట్లాడుతూ…. భారతీయ న్యాయ సహిత చట్టం సెక్షన్ 106(1) రద్దు చేయాలని. రవాణా రంగ కార్మికులకు ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రవాణా రంగంపై ఆధారపడి జీవిస్తున్న రవాణా రంగ కార్మికులు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ ,బస్సు ఉచిత ప్రయాణం పేరుతో ఆటో టాటా ఏసీ,కార్మికులు రోడ్డున పడ్డారని, కరీంనగర్ జిల్లాలో ట్రాఫిక్ పోలీసులు ఆటో డ్రైవర్ల పై ఆటోపై టాప్ నెంబర్లు లేవు అని, చాలాన్, పేరుతో దాడులు జరుపుతున్నారని దాడులు ఆపాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా రంగంపై 50 లక్షల మంది రవాణా రంగ కార్మికులు ఆధారపడి జీవిస్తున్నారు. వీరి యొక్క సంక్షేమాన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితబస్సు ప్రయాణం పేరుతో మహాలక్ష్మి పథకం ప్రారంభించడం వల్ల రవాణా రంగంపై ఆధారపడి జీవిస్తున్న 50 లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు,. రవాణా రంగ కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామాయ మార్గాలు చూపించాలని, ఓలా ,ఉబర్, జస్ట్ డయల్, యాప్ లు రద్దు చేయాలని కోరారు,

* ట్రాన్స్పోర్ట్ జిల్లా అధ్యక్షులు పున్నం రవి మాట్లాడుతూ…..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కమిషన్ లేకుండా ప్రభుత్వమే కేరళ తరహా రవాణా రంగం కార్మికులకు యాప్ తీసుకురావాలని , డిజిల్, పెట్రోల్ ఇన్సూరెన్స్ ,ఫిట్నెస్ ధరలు తగ్గించాలని, వేలాది రూపాయలు ఫైనాన్స్ లు తీసుకొని వివిధ రకాల వాహనాలు నడుపుతున్నారని వారు ఇప్పుడు రోడ్డు పాలయ్యారు ఆయన అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు చెల్లిస్తామని ఎన్నికల సందర్భంగా మాట ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకాన్ని అమలు చేయకుండా కార్మికుల పొట్ట గొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రవాణా రంగ కార్మికుల సంక్షేమం చట్టం చేయాలని ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలని ఆయన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ పట్టణ లారీ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు ఎంకే ఆరిఫ్ మొయినుద్దీన్, ఆటో డ్రైవర్లు కనకయ్య, దెయ్యాల శ్రీను, టాక్సీ డ్రైవర్స్ ప్రభాకర్, వీరస్వామి, ముక్కెర శ్రీను, నాగరాజు, సంతోష్, రవి,  శ్రీకాంత్ సతీష్ కుమార్, అనంతోజు రమేష్ మల్లేశం,  షాబుద్దీన్  అనిల్, దేవయ్య, సంపత్, కుమార్ భాస్కర్ రెడ్డి, శంకర్,శ్రీధర్,నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు