రాజన్న సిరిసిల్ల జిల్లా/ఇల్లంతకుంట, జూలై 23 (జాగో న్యూస్): రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల సోమారంపేట గ్రామంలోనీ నిరుపేద మూడేపల్లి హన్మంతు ఆకస్మికంగా మరణించగా వారి కుటుంబ సభ్యులను ఓదార్చి 50 kg బియ్యం అందించి, రేపాక గ్రామంలో నిరుపేద బండి ఎల్లయ్య ఆకస్మికంగా చనిపోగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 50 kg బియ్యం బస్తాలు BTR (Bendram Thirupathi Reddy) FOUNDTION ద్వారా సహాయాలు అందజేసిన బెంద్రం.తిరుపతి రెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాట్లాడాతూ… పేదలకు ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చిన మీకు నేను అండగా వుంటూ సహాయాలు అందిస్తామన్నారు ఈ సహాయ సేవాలలో బి.టీ.ఆర్ ఫౌండేషన్ సేవాప్రతినిధులు గైని శ్రీనివాస్, మ్యాక శ్రీనివాస్, అంతగిరి అనిల్, గజ్జల శ్రీనివాస్, కోమటిరెడ్డి అనిల్, లింగంపెల్లి పర్శరాములు, రొండ్ల. శివ, ముడపెల్లి కోటి, బండి అనిల్ తదితరులు పాలుగోన్నారు.
