కరీంనగర్/తిమ్మాపూర్, ఫిబ్రవరి 15 (జాగో న్యూస్): తిమ్మాపూర్ మండలం మన్నెంపెల్లి గ్రామంలో శనివారం జరిగిన ట్రాక్టర్ యూనియన్ ఎన్నికలలో అధ్యక్ష,ఉపాధ్యక్షులుగా సుదగొని పర్షరాములు గౌడ్, అసోద నరేందర్ లు ఎన్నికయ్యారు. యూనియన్ క్యాషియర్ గా కొలిపాక శ్యామ్ ప్రసాద్,కార్యవర్గ సభ్యులుగా సానగోండ అనిల్, సానగోండ ఐలయ్య, నాంపల్లి జగన్, నాంపల్లి శ్రీనివాస్, పొట్ట శ్రీనివాస్,మాచర్ల ఎల్లయ్య ,బీనపెల్లి శ్రీనివాస్ గార్లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం మాట్లాడుతూ యూనియన్ అభివృద్ధికి కృషి చేస్తామని చెబుతూ, అదే విధంగా మాయొక్క ఎన్నికకు సహకరించిన సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
