రాజన్న సిరిసిల్ల/తంగళ్ళపల్లి, మార్చి 04 (జాగో న్యూస్): తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బిజెపి పార్టీ అభ్యర్థి మల్కా కొమరయ్య ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడం పట్ల హర్షిస్తూ బిజెపి శ్రేణులు టపాసులు పెంచి స్వీట్లను పంపిణీ చేసి సంబరాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్ రావు, ఉపాధ్యక్షుడు ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి ఇట్టుకల రాజు, శ్రీనివాస్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు కన్నె అరుణ్,OBC మోర్చా అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, జంగం కిషన్, బక్క శెట్టి రాజు, ఆశీర్వాద్, లక్ష్మారెడ్డి, మధుసూదన్, సురేష్, మహేందర్, జీవన్ రెడ్డి పాల్గొన్నారు.
