గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వమే నేరుగా గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు ఇవ్వాలి

కరీంనగర్, మార్చి 04 (జాగో న్యూస్): గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వమే గ్రీన్ ఛానల్ ద్వారావేతనాలు నేరుగా చెల్లించాలని కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో సూపర్డెంట్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. అనంతరం విలేకరుల సమావేశంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో రెండు నుంచి మూడు నెలల పైన వేతనాలు బకాయి ఉన్నాయని వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల వేతనాలు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని, గత 2024 డిసెంబర్ నెలలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించి, నేరుగా ప్రభుత్వమే వారి అకౌంట్లో వేతనాలు చెల్లిస్తానని, ఒకటో తారీకు నుండి పదో తారీకు లోపు వేతనాలు చెల్లిస్తామని చెప్పి మూడు నెలలు గడుస్తున్నా, కూడా వేతణలు అందలేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వేతనాలు అందించ క పోతే కార్మికులు మరో సమ్మె పోరాటానికి వెనుకాడరని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు రాచర్ల మల్లేశం, ఉపాధ్యక్షులు కాశిపాక శంకర్, కమిటీ సభ్యులు గంధసిరి సంపత్ , గరిగంటి రవి, రాచపల్లి రవి, లింగయ్య, సంపత్, తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు