రాజన్న సిరిసిల్ల/తంగళ్ళపల్లి, ఏప్రిల్ 02 (జాగో న్యూస్):
తంగళ్ళపల్లి మండలం, బస్వాపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు చింతచెట్టు పై నుండి పడి మృతి చెందిన బంటు ఆనందం నిరుపేద కుటుంబానికి 50 కిలోల బియ్యం మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య వితరణ చేశారు. బస్వాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి పూర్మాని కనక లక్ష్మి లక్ష్మారెడ్డి 2వేల500 వందలు, శ్రీనివాస్ రెడ్డి 2వేల 500 చొప్పున నిరుపేద కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయగా, గ్రామాలలో అంతక్రియలు చేసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సహాయం కింద ₹20,000 అందించాలని ఈ సందర్భంగా అంతయ్య డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కర్నే బాలయ్య, మాజీ సర్పంచ్ గుడిసెల నీరజ, ఎల్లయ్య, తాటిపాముల శ్రీనివాస్, గొడిసెల తిరుపతి, దేవయ్య, సత్తు రామ్ రెడ్డి, చంద్రమౌళి, సురేష్, మల్లయ్య, బాబు, కనకయ్య, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.
