కరీంనగర్, ఏప్రిల్ 02 (జాగో న్యూస్): లింగ నిర్ధారణకు పాల్పడిన స్కానింగ్ సెంట్రల్ పై కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ హెచ్చరించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో బుధవారం కరీంనగర్ జిల్లాలో స్కానింగ్ కేంద్రాలను, ఫెర్టిలిటీ కేంద్రాలను స్పెషల్ డ్రైవ్ టీoతో తనఖీ చేయడం జరిగింది. ఈ స్కానింగ్ కేంద్రాలలో స్కానింగ్ కొరకు వచ్చిన వారి అవుట్ పేషెంట్ రిజిస్టర్ లు, పి.సి.పి.ఎన్.డి.టి జిల్లా అప్రోప్రియేట్ అథారిటీ కమిటీ ద్వారా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్, అందులో పని చేస్తున్న డాక్టర్స్ క్వాలిఫికేషన్ వెరిఫికేషన్ మరియు గర్బస్థ పూర్వ, గర్బస్థ లింగ నిర్దారణ చట్టం – 1994 మరియు రూల్స్ 1996 అమలవుతున్న తీరు, గర్బస్థ శిశువుగా ఉన్నప్పుడూ స్త్రీ, పురుష లింగ నిర్దారణ పరీక్షలు చేసినట్లయితే పరీక్షలు చేసిన వారికి, చేయించుకున్న వారికి, అందుకు ప్రోత్సహించిన వారికి చట్ట ప్రకారం మూడు సంవత్సరాల వరకు జైల్ శిక్ష, పది వేల రూపాయల జరిమానా విధించబడుతుందని, అలాగే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపే బోర్డులు ప్రదర్శిస్తున్నారా లేదా మరియు స్కాన్నింగ్ కేంద్రాలలో కచ్చితంగా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ధరల పట్టిక, సరైన రికార్డుల నిర్వహణ ఉండాలని, ప్రతి నెల జరిగే స్కానింగ్ వివరాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి పంపిస్తున్న తీరు, లింగ నిర్దారణ పరీక్షలు చట్ట రీత్యా నేరమని, పుట్టబోయే బిడ్డ ఆడ, మగ అని చెప్పకూడదని బోర్డులు స్కానింగ్ కేంద్రాలలో ప్రదర్శించడాన్ని పరిశీలించడం జరిగింది. ఈ స్కానింగ్ కేంద్రల, ఫెర్టిలిటీ కేంద్రాల యొక్క తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, డాక్టర్ వెంకటరమణ తెలియజేశారు. ఈ స్పెషల్ డ్రైవ్ తనిఖీ లో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ, పి.సి.పి.ఎన్.డి.టి ప్రోగ్రామ్ అధికారి డా.సనా జవేరియా, పోలీస్ శాఖ నుండి సృజన్ రెడ్డి సిఐ, ఏఎస్ఐ విజయమణి, రాజగోపాల్ డెమో, కె. రమేశ్ డీఈవో, సుపెర్వైజర్ సయ్యద్ సాబీర్ లు పాల్గొన్నారు.
