నాగల్ గిద్ద, ఎప్రిల్ 06 (జాగో న్యూస్): నాగల్ గిద్ద మండలం శేరిదామరగిద్ద గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా జాతర ఉత్సవ కార్యక్రమం నిర్వహించరు . శ్రీరామ నవమి సందర్భంగా జాతరకు విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని శ్రీధర్ రావు పాటీల్ నిర్వహించారు. శేరిదామరగిద్ద చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో కుస్తీ పోటీలు చూడడానికి ప్రజలు వచ్చారు. కుస్తీ పోటీలకు కర్ణాటక మహారాష్ట్రల నుండి మల్ల యోదులు వచ్చి కుస్తీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ముష్టి పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు నగదు ఇచ్చి వారిని ప్రోత్సహించారు. గ్రామ పెద్దలు మాజీ ఎంపిటిసి పండరినాథ్ పాటిల్, శ్రీధర్ రావు పాటిల్, శరణప్ప్, హన్మంతు రావు, సూర్యప్రకాష్ రెడ్డి, మాణిక్ రావు తదితరులు పాల్గొన్నారు.
