ఉచిత మజ్జిగను కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ సత్పతి

కరీంనగర్, ఏప్రిల్ 07 (జాగో న్యూస్): మండు వేసవిలో ప్రజల దాహార్తి తీర్చడం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో వచ్చేటువంటి ప్రజలకు ఉద్యోగులకు మరియు అధికారులకు ఉచిత మజ్జిగ పంపిణీ చేసిన టీఎన్జీవోల సంఘాన్ని కరీంనగర్ జిల్లా కలెక్టర్ అభినందించారు. స్థానిక కలెక్టరేట్ కార్యాలయం లో ప్రజావాణి కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలకు ఉద్యోగులకు, అధికారుల దాహార్తి తీర్చడం కోసం ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా టీఎన్జీవోల సంఘం శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ టీఎన్జీవోల సంఘం నాయకులు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలలో చాలా అభినందినీయమని కొనియాడారు రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలకు చేయాలని వారు తెలిపారు. ఈ సందర్భంగా గౌరవ జిల్లా కలెక్టర్ ని ఉద్దేశించి ఎంప్లాయిస్ జేఎసి చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ మాకు ఆదర్శనీయమని తాను చేస్తున్న కార్యక్రమాలలో భాగంగా పేద పిల్లలకు ఉచిత పుస్తక పంపిణీ అనాధ పిల్లలకు వివాహం చేయటం అదేవిధంగా స్థానిక కలెక్టరేట్లో లైబ్రరీని ప్రారంభించడం మహిళలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తినప్పుడు ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా ఉచితంగా మహిళలందరికీ ఆరోగ్య పరీక్షలు చేయడంలాంటి సేవా కార్యక్రమాలుతో పాటు వేసవికాలంలో గొంతు తడారి పోతూ సుదూర ప్రాంతాల నుంచి ప్రజావాణికి వారి సమస్యలను పరిష్కరించు కోవడానికి వచ్చిన పేద ప్రజలకు మజ్జిగ పంపిణీ చేయడం మాకు కూడా ఆనందంగా ఉందని ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రజలకు సేవ చేయడమే మా కర్తవ్యం అని అన్నారు మానవసేవే మాధవ సేవగా భావించిన హ్యుమానిటీకి దగ్గరగా ఉండి మా ఉద్యోగులందరినీ ప్రోత్సహిస్తున్న మాకు ఇలాంటి జిల్లా కలెక్టర్ ఉండడం మా కరీంనగర్ జిల్లా ఉద్యోగులందరి అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు వినూతన రీతిలో అనాధ అమ్మాయికి జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో వివాహము చేసి కరీంనగర్ జిల్లాలో నూతన ఉరవడికి శ్రీకారం చుట్టారని…అందులో మా ఉద్యోగులందరికీ మా సంఘ సభ్యులను భాగస్వాములను చేయడం మాకెంతో సంతృప్తినిచ్చిందని ప్రతి శుక్రవారం సదస్సులు పెడుతూ గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందించుటలో ప్రత్యేక శ్రద్ధను చూపిస్తూ అదేవిధంగా ఆరోగ్య మహిళ పేరిట ఎన్నో కార్యక్రమాలను చేస్తూ మహిళా ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని పేద విద్యార్థులకు విద్యను అందించుటలో కూడా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని మా ఉద్యోగులందరినీ భాగస్వాములను చేస్తూ కరీంనగర్ జిల్లాకే వన్నె తెచ్చే విధంగా అభివృద్ధి పథంలో కరీంనగర్ జిల్లా ను ముందు ఉంచుతున్నారని…. ఇలాంటి జిల్లా కలెక్టర్లు అన్ని జిల్లాల్లో ఉంటే ప్రభుత్వం మూడు కాలాలపాటు పచ్చగా వర్ధిల్లుతుందని అన్నారు ఇంత చక్కటి కార్యక్రమాలు
చేస్తున్నటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ కి టీఎన్జీవోల సంఘం పక్షాన అదేవిధంగా టీజేఏసీ పక్షాన హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోల జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి కార్యదర్శి సంగం లక్ష్మణరావు టీజీవోల సంఘం జిల్లా అధ్యక్షులు మడిపల్లి కాళి చరణ్ గౌడ్ కార్యదర్శి డాక్టర్ అరవింద రెడ్డి కేంద్ర సంఘం నాయకులు నాగుల నరసింహస్వామి రాగి శ్రీనివాస్ గూడ ప్రభాకర్ రెడ్డి సర్దార్ హర్మేందర్ సింగ్ జిల్లా కోశాధికారి ముప్పిడి కిరణ్ కుమార్ జిల్లా సహాధ్యక్షులు ఒంటెల రవీందర్ రెడ్డి కరీంనగర్ పట్టణ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్ కార్యదర్శి వెలిచాల సుమంత్ రావు 4వ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కోట రామస్వామి కార్యదర్శి శంకర్ ఉమెన్ ఎంప్లాయిస్ చైర్మన్ ఇరుమల్ల శారద డ్రైవర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంజీత్ సింగ్ పెన్షనర్ల సంఘం అధ్యక్షులు పెండ్యాల కేశవరెడ్డి కార్యదర్శి లింగయ్య నాయకులు పోలు కిషన్ నగేష్ గౌడ్ శైలజ సబితా కరుణాకర్ లవ కుమార్ నారాయణ అజ్గర్ కయ్యం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు