కరీంనగర్, ఫిబ్రవరి 04 (జాగో న్యూస్): ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాల్సిందిగా అభివృద్ధికి సహకరించాల్సిందిగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. 63 వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి కర్రె పావని పావనికి మద్దతుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా డివిజన్ లో అభివృద్ధి కుంటుపడ్డదని కర్రె పావనిని గెలిపించి డివిజన్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలని ఈ డివిజన్ అభివృద్ధికి తాను కృషి చేస్తానని నరేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్,ఆకారపు భాస్కర్ రెడ్డి,అబ్దుల్ రహమాన్ తదితరులు పాల్గొన్నారు.








